పెంకుటిల్లు కూలి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-08-09T05:25:26+05:30 IST

పెంకుటిల్లు కూలి వృద్ధురాలి మృతి

పెంకుటిల్లు కూలి వృద్ధురాలి మృతి

మంగపేట, ఆగస్టు 8: భారీ వర్షానికి పెంకుటిల్లు కూలి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తమల్లూరు శివారు  గొత్తికోయగూడెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు గొత్తికోయ సమామాజిక వర్గానికి చెందిన సోయం మంగమ్మ(65) ఇంటి గోడలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. గోడలు, పైకప్పు మీద పడటంతో మంగమ్మ మృతిచెందింది. ఆ సమయంలో ఆమె ఇంట్లోనే నిద్రిస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం ఉదయం వృద్ధురాలి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. మంగమ్మ కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట వద్ద ఉంటుండగా ఆమె ఒక్కరే ఇంట్లో నివసిస్తోంది. స్థానికులు అందించిన సమాచారంతో ఆర్‌ఐ కుమారస్వామి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


Updated Date - 2022-08-09T05:25:26+05:30 IST