నడక ఆయుష్షుకు మంచిది
ABN , First Publish Date - 2020-03-27T06:45:29+05:30 IST
ప్రతిరోజూ నడవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అమెరికాలో నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది....
వాషింగ్టన్, మార్చి 26: ప్రతిరోజూ నడవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అమెరికాలో నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతులైన 4800 మందిపై మూడేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పరిశోధనల్లో భాగంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారికి ట్రాకర్లు అమర్చి వారు నడిచిన దూరాలను పరిశీలించారు. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ లాంటి ఆరోగ్య సూచీలను బట్టి మరణించే ప్రమాదాన్ని అంచనా వేశారు. అయితే ఎంతదూరం నడిస్తే ఎంత మేర ప్రమాదం తగ్గుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.