మెడికల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి
ABN , First Publish Date - 2021-10-22T04:00:13+05:30 IST
మెడికల్ కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 21 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మాట్లాడారు. జూన్ 25న జీవో నెంబర్ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం బేసిక్ పే, డీఏ కలిపి రూ.19,147 వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 21 : మెడికల్ కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 21 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మాట్లాడారు. జూన్ 25న జీవో నెంబర్ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం బేసిక్ పే, డీఏ కలిపి రూ.19,147 వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. జీవో అమలు కాకుండా ప్రభుత్వమే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దగా చేస్తోందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 25న హైద్రాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరాహార దీక్షలో కాంట్రాక్టు మెడికల్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరా రు. రాజమల్లు, కుమార్, సువర్ణ, యాకూబ్పాషా, శంకరమ్మ పాల్గొన్నారు.