రేపటి నుంచి వేతనాలు?

ABN , First Publish Date - 2022-02-02T02:01:09+05:30 IST

కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు బుధవారం నుంచి వేతనాలను వేసేందుకు

రేపటి నుంచి వేతనాలు?

అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు బుధవారం నుంచి వేతనాలను వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులకు పంపకుండానే 11వ పీఆర్సీ ప్రకారం బిల్లులను సీఎఫ్ఎంఎస్ తయారు చేసింది. ఉద్యోగులకు పాత, కొత్త వేతనాల పే స్లిప్‌ని ఆర్థికశాఖ పంపింది. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపునకు ఆర్థికశాఖ అధికారులు సిద్ధం చేశారు. పే స్లిప్‌లను చూసుకోవాలని ఉద్యోగులకు హితవు పలికింది. 5 డీఏలను కలిపి గత నెల కంటే జీతం పెరిగిందంటూ అధికారులు చూపించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికారులు శాంపిల్‌గా కొందరికి వేతనాలను అకౌంట్‌లో వేశారు.  


Updated Date - 2022-02-02T02:01:09+05:30 IST