ఒడిశా దూకుడుపై స్పందించండి

ABN , First Publish Date - 2020-11-01T10:27:48+05:30 IST

కొటియా గ్రామాలపై ఒడిశా సర్కార్‌ అవలంబి స్తున్న దూకుడుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్య క్షుడు

ఒడిశా దూకుడుపై స్పందించండి

విజయనగరం దాసన్నపేట, అక్టోబరు 31:  కొటియా గ్రామాలపై ఒడిశా సర్కార్‌ అవలంబి స్తున్న దూకుడుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్య క్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు శనివారం  ఇన్‌చార్జి కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌కు వినతిపత్రం అం దించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వా తంత్ర్యానికి ముందే కొటియా పరిధిలో 21 గ్రామాలు   మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉన్నాయని, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో భాగమయ్యాయని తెలిపారు.  అయితే ఆయా గ్రామాల్లో ఒడిశా సర్కార్‌ భారీ ఎత్తున నిర్మాణాలు, బోర్డులు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. న్యాయస్థానం యధాతథ స్థితి పాటించాలని ఆదేశించినప్పటికీ, ఒడిశా అధికారులు కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌ నిర్మిస్తున్నారని తెలిపారు. తెలుగు పదం కనబడ కుండా చేస్తున్నారని చెప్పారు. దీనిపై  ప్రభుత్వానికి తెలియజేసి తగు చర్యలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2020-11-01T10:27:48+05:30 IST