తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం..
ABN , First Publish Date - 2020-10-30T11:55:36+05:30 IST
గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్క రిస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగపు డీఈఈ ఈశ్వరీభాయి అన్నారు.
వేపాడ: గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్క రిస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగపు డీఈఈ ఈశ్వరీభాయి అన్నారు. వల్లంపూడి, కుమ్మపల్లి గ్రామాల్లో ఆమె గురువారం పర్య టించారు. వల్లంపూడిలో బోరు నుంచి బురుదనీరు రావడాన్ని గుర్తించి, సమస్య పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కుమ్మపల్లిలో పైపులైన్ లీకేజీలను సరి చేయించారు. రక్షిత మంచి నీటి పథకాలను పరిశీలించారు. గ్రామాల్లో ఏవిధమైన తాగునీటి సమస్యలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఈ దేవి, సిబ్బంది ఉన్నారు.