రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయలు

ABN , First Publish Date - 2020-10-30T11:53:24+05:30 IST

మండలంలోని షికారు గంజి జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయలు

దత్తిరాజేరు, అక్టోబరు 29: మండలంలోని షికారు గంజి జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బూర్జివలస ఎస్‌ఐ బి.భాగ్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. పార్వతీపురం నుంచి విజయనగరం వైపు వెళుతున్న కారు.. గజపతినగరం నుంచి బొబ్బిలి వైపు వెళుతున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న ఎస్‌.చింతలవలసకు చెందిన డ్రైవర్‌ సూర్యనారాయణ, పారాది గ్రామానికి చెందిన మైలపల్లి సీతమ్మ, మైలపల్లి సింహాచలం, నగర ఆదిలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోడ్రైవర్‌, సీతమ్మల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తలించా రు. కారులో ఉన్న నెల్లి రమేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ భాగ్యం చెప్పారు.

Updated Date - 2020-10-30T11:53:24+05:30 IST