బైకుపై నుంచి పడి..
ABN , First Publish Date - 2020-10-28T07:57:05+05:30 IST
కుక్క అడ్డంగా రావడంతో బైకుపై నుంచి యువకుడు పడి మృతి చెందిన సంఘటన కాటకాపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
కొత్తవలస: కుక్క అడ్డంగా రావడంతో బైకుపై నుంచి యువకుడు పడి మృతి చెందిన సంఘటన కాటకాపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కాటకా పల్లి గ్రామానికి చెందిన గూనూరు సురేష్(21) సోమవారం సాయంత్రం తన పెద్దమ్మ కుమారుడు గూనూరు నవీన్కుమార్తో కలిసి బైకుపై గ్రామంలోని జంక్షన్కు వెళ్తున్నారు. నవీన్కుమార్ బైకు డ్రైవ్ చేస్తుండగా, సురేష్ వెనుక కూర్చున్నాడు. గ్రామానికి సమీపంలోని మల్లమ్మ గుడి వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో నవీన్కుమార్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక కూర్చున్న సురేష్ రోడ్డు మీద పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మేనమామ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.