చంపావతి నదిలో మృతదేహం గుర్తింపు
ABN , First Publish Date - 2020-10-28T07:54:18+05:30 IST
ఆనందపురం వద్ద చంపావతి నదిలో పడి కొట్టుకుపోయిన ఒక వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది.
గుర్ల: ఆనందపురం వద్ద చంపావతి నదిలో పడి కొట్టుకుపోయిన ఒక వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు (42) తన అక్క ఇంటికి ఆనందపురం వచ్చి, సోమవారం ఉదయం చంపావతి నదికి స్నానానికి వెళ్లాడు. ప్రమాద వశాత్తు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గ్రామస్థులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని గాలించే ప్రయత్నాలు చేశా రు. కానీ ఫలితం లేకపోయింది. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకొని 8 గంటల సుదీర్ఘ శోధన తరువాత మృత దేహాన్ని వెలితీసి కుటుంబ సభ్యులకు అందజేశారు.