ప్రియురాలి మౌనదీక్ష
ABN , First Publish Date - 2020-10-01T11:27:37+05:30 IST
జొన్నవలస గ్రామంలో బుధవారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన యువతి, ఆగ్రామానికి చెందిన టి.దినేష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
గరివిడి, సెప్టెంబరు 30 : జొన్నవలస గ్రామంలో బుధవారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన యువతి, ఆగ్రామానికి చెందిన టి.దినేష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వివాహం చేసుకోవడానికి దినేష్ ఒప్పుకోవడం లేదని ఆరు నెలల కిందట తండ్రికి ఆమె చెప్పింది.
ఆయన గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా... సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. చివరకు ఆ యువతి ప్రియుడి ఇంటి ముందర బుధవారం మౌనదీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణరావు గ్రామానికి వెళ్లారు. ఇరు కుటుంబాలు, గ్రామ పెద్దలతోనూ చర్చలు జరిపి, బాధితురాలితో ఆందోళన విరమింపజేయించారు.