త్వరలో వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-10-01T01:13:50+05:30 IST

త్వరలో వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

త్వరలో వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం: హరీష్‌రావు

జమ్మికుంట: త్వరలో వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైశ్య కార్పొరేషన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయమే అయినప్పటికి, కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ‘‘మాజీమంత్రి ఈటల రాజేందర్‌ నా తమ్ముడు, నా కుడి భుజం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు సభా వేదికగా చెప్పారని హరీష్ రావు గుర్తుచేశారు. ఏ ఎన్నికలు లేని నాడు రైతుబంధు లాంటి గొప్ప పథకాన్ని శాలపల్లి నుంచి కేసీఆర్‌ ప్రారంభించినట్లు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా అంటే కేసీఆర్‌కు ఇష్టమని, అందుకోసమే హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న శాలపల్లిలో రైతుబంధు పథకం ప్రారంభించారని తెలిపారు. రాజకీయ అక్షరాలు నేర్పించి, ఆరు సార్లు ఎమ్మెల్యే చేసి, రెండు సార్లు మంత్రిని చేసి ఈ స్థాయికి తీసుకు వచ్చిన కేసీఆర్‌కు ఘోరీ కడుతా అని ఈటల మాట్లాడడం సంస్కారం అవుతుందా అని హరీష్‌రావు ప్రశ్నించారు. అన్నారు. 

Updated Date - 2021-10-01T01:13:50+05:30 IST