వైశ్యులంతా సంఘటితంగా ముందుకుసాగాలి
ABN , First Publish Date - 2021-01-25T07:05:02+05:30 IST
వైశ్యులంతా సంఘటితంగా ముందుకు సాగాలని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం అన్నారు.
- ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం
- ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా కంచర్ల ఎన్నిక
మండపేట, జనవరి 24: వైశ్యులంతా సంఘటితంగా ముందుకు సాగాలని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లా ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షుడిగా మండపేటకు చెందిన కంచర్ల మాణిక్కాలరావు (జిల్లా) రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీతారామ కల్యాణమండపంలో ఆదివారం ఆర్యవైశ్య మహాసభ జరిగింది. ఈసందర్భంగా జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మాణిక్కాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా పశ్చిమగోదావరికి చెందిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు గణపతిరావు, వెంకట శ్రీనివాసరావులు వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడారు. జిల్లా అధ్యక్షు డిని, కార్యవర్గాన్ని ఆయన అభినందించి సత్కరించారు. రాజోలుకు చెందిన కంచర్ల బాబి, చెల్లూరుకు చెందిన కంచర్ల చినవీరభద్రరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మాజీ అధ్యక్షుడు అత్తులూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయులు, పేరూరి కృష్ణ, కేశవరపు శ్రీనివాస్, కంచర్ల ప్రసాద్,నాళం కిట్టు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్యవైశ్యులు పాలొన్నారు.