నిబంధనలు పాటించక పోతే చర్యలు

ABN , First Publish Date - 2021-05-17T06:18:00+05:30 IST

పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ టి.రంగారావు హెచ్చరిం చారు.

నిబంధనలు పాటించక పోతే చర్యలు

 ఉయ్యూరు కమిషనర్‌ రంగారావు హెచ్చరిక

ఉయ్యూరు, మే 16 : పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ టి.రంగారావు హెచ్చరిం చారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఆదివారం పట్టణంలో పర్యటించి మాస్కులేకుండా విక్రయాలు చేస్తున్న షాపుల యజమా నులను హెచ్చరించారు. ప్రధాన సెంటర్‌ సమీపాన మాస్కు లేకుండా అమ్మకాలు చేయడం,  భౌతిక దూరం పాటించకుండా షాపు వద్ద వినియో గదారులు గుమికూడి ఉన్న  తాళ్ల వ్యాపారస్తుడికి రూ.500 జరిమానా విధించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించి కరోనా కట్టడికి అందరూ సహకరించాలని విజ్ఞపి ్త్తచేశారు. 


Updated Date - 2021-05-17T06:18:00+05:30 IST