చేపల వేటకు వెళ్లి యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2022-09-28T03:05:53+05:30 IST
బొగ్గేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాం
మర్రిపాడు, సెప్టెంబరు 27 : బొగ్గేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాంపల్లిలో మంగళవారం జరిగింది. బొద్దుకూరు హరిప్రసాద్(23) రఘు అనే వ్యక్తితో కలిసి బొగ్గేరులో విద్యుత్ ద్వారా చేపలు పట్టేందుకు వెళ్లి నీళ్లల్లో తీగలు పెట్టిన వెంటనే షాక్ తగిలి హరివరప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న రఘుకి తీవ్ర గాయాలు కాగా, ఆత్మకూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.