విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-01T02:56:38+05:30 IST

విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే ఉపాధ్యాయులు లక్ష్యమని అప్పటి గురువులు బొద్దులూరి సుందరామయ్య, మోడం

విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం
పూర్వ విద్యార్థులతో నాటి ఉపాధ్యాయులు

బిట్రగుంట, జూన్‌ 30: విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే ఉపాధ్యాయులు లక్ష్యమని అప్పటి గురువులు బొద్దులూరి సుందరామయ్య, మోడం రామచంద్రారెడ్డిలు అన్నారు. బోగోలు మండలం విశ్వనాఽథరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 1985-86 సంవత్సరం పదో తరగతి విద్యార్థుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన సరస్వతీ విగ్రహ ఆవిష్కరణ గురువారం జరిగింది.  వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు కలసుకొని గురువులను సన్మానించారు.  పంచాయతీ సర్పంచు గండూరి మంజుల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు  నాటారు. ముంగమూరు భవానీ ఎడ్యుకేషనల్‌ సొసైటీలోని పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా పూర్వ విద్యార్థి బత్తుల రవిచంద్రను తోటి విద్యార్థులు సన్మానించారు.


Updated Date - 2022-07-01T02:56:38+05:30 IST