‘లౌకిక ప్రజాస్వామ్యమే కీలకం’

ABN , First Publish Date - 2022-08-10T05:29:06+05:30 IST

కాకినాడ సిటీ, ఆగస్టు 9: లౌకిక ప్రజాస్వామ్యమే భారతదేశ ఐక్యతకు కీలకంగా నిలుస్తుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం యూటీఎఫ్‌ హోంలో 75ఏళ్ల భారతదేశం-లౌకిక విద్యకు సవాళ్లు అనే అంశంపై యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేవీవీ నగష్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్సీ ము ఖ్యవక్తగా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించే చర్చలలో ఆనాటి నేతలు ముం

‘లౌకిక ప్రజాస్వామ్యమే కీలకం’

కాకినాడ సిటీ, ఆగస్టు 9: లౌకిక ప్రజాస్వామ్యమే భారతదేశ ఐక్యతకు కీలకంగా నిలుస్తుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం యూటీఎఫ్‌ హోంలో 75ఏళ్ల భారతదేశం-లౌకిక విద్యకు సవాళ్లు అనే అంశంపై యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేవీవీ నగష్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్సీ ము ఖ్యవక్తగా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించే చర్చలలో ఆనాటి నేతలు ముందు చూపుతో లౌకికమార్గాన్ని అనుసరించారన్నారు. సోషలిస్టు పం ధాను ఎంచుకోవడం వల్ల ప్రభుత్వ రంగం అభివృద్ధి చెంది కొంతవరకు సామాజిక న్యాయం అమలైందన్నారు. విద్యా వికాస వేదిక రూపొందించిన ఆరు రకాల స్కూళ్లు ఎవరి కోసం.. ఎందుకోసం అనే బుక్‌ లెట్‌ను విడుదల చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ, సీనియర్‌ నేత సీహెచ్‌ సత్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రవిచక్రవర్తి, యూటీఎఫ్‌ నాయకులు బి.ప్రసాదరావు, టి.అన్నారం, పీవీఎన్‌ గణేష్‌, సాయిరాం, వీరబాబు, జేవీవీ నాయకుడు కేఎం.ప్రసాద్‌, సీఐటీయూ అధ్యక్షుడు పలివెల వీరబాబు, ప్రజానాట్య మండలి కళాకారుడు దారపురెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:29:06+05:30 IST