సచివాలయ ఉద్యోగాల కల్పన జగనన్న ఘనతే..
ABN , First Publish Date - 2022-08-18T03:40:20+05:30 IST
సచివాలయ ఉద్యోగాల కల్పన జగనన్న ఘనతేనని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పాతూరులోని
కావలిటౌన్, ఆగస్టు 17: సచివాలయ ఉద్యోగాల కల్పన జగనన్న ఘనతేనని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పాతూరులోని కల్యాణ మండపంలో సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ జరిగింది. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిఽఽథిగా ఎమ్మెల్యే పాల్గొని ఉద్యోగులను అభినందించి నియామక పత్రాలు అందించారు. అనంతరం ప్రతాప్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో ప్రతిభావంతులకే అవకాశం కల్పించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఈ ఉద్యోగాల్లో టీడీపీకి చెందిన వారుకూడా ఉన్నారంటే ఎంపికలు ఎంత పారదర్శకంగా జరిగాయో..? తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కిరణ్, వన్టౌన్ సీఐ శ్రీనివాసులు, నేతలు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, దామిశెట్టి సుధీర్నాయుడు, తిరువీది ప్రసాద్, పందిటి కామరాజు. నాయబ్, నాగాచారి తదితరులు పాల్గొన్నారు.