వ్యర్ధాలు వేసేవారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-20T02:52:31+05:30 IST

నీళ్లు సరఫరాచేసే పైపు లు ఉన్న ప్రదేశంలో మాంసపు వ్యర్థాలను వేస్తున్నారని, అలావేసేవారిపై కఠిన చర్యలు తీసు

వ్యర్ధాలు వేసేవారిపై చర్యలు తీసుకోవాలి

తడ, జనవరి 19 : గ్రామానికి నీళ్లు సరఫరాచేసే పైపు లు ఉన్న ప్రదేశంలో మాంసపు వ్యర్థాలను వేస్తున్నారని, అలావేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీవీ పాళెం సర్పంచు గీతాప్రకాష్‌, ఎమ్మెల్యే  సంజీవయ్యకు విన్నవిం చుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో కార్యాల యం వద్ద ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తమిళ నాడు ఆరంబాకంకు చెందిన మాంసం వ్యాపారులు చనిపో యిన కోళ్లు, మాంసపు వ్యర్ధాలను అక్కడ నుంచి తీసుకు వచ్చి తమ పంచాయతీ పరిధిలోని కల్వర్టు దగ్గర  వేస్తు న్నారని తెలిపారు. అక్కడ నీళ్లపైపులు ఉన్నాయని, దీంతో నీళ్లు కలుషితమవుతున్నాయని ఆమె తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచు ఎమ్మెల్యేకు వివరించారు. చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 


Updated Date - 2022-01-20T02:52:31+05:30 IST