పలు రైళ్లు రీ షెడ్యూల్
ABN , First Publish Date - 2021-02-27T06:05:38+05:30 IST
ఖరగ్పూర్ డివిజన్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ మీదుగా నడుస్తున్న కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఖరగ్పూర్ డివిజన్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ మీదుగా నడుస్తున్న కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. హౌరా నుంచి యశ్వంత్పూర్ వెళ్లే ప్రత్యేక రైలు(02245) ఈ నెల 27న ఆరు గంటలు ఆలస్యంగా, హౌరా నుంచి ఎర్నాకులం వెళ్లే ప్రత్యేక రైలు(02877) ఈ నెల 27న రెండన్నర గంటలు ఆలస్యంగా బయలుదేరుతాయి. గౌహతి నుంచి బెంగళూరు వెళ్లే ప్రత్యేక రైలు(2510) ఈ నెల 28న రెండన్నర గంటలు, మార్చి ఒకటి, రెండు తేదీల్లో గంట 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. గౌహతి నుంచి బెంగళూరు వెళ్లే మరో ప్రత్యేక రైలు (02514) మార్చి నాలుగున గంట 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.