టీడీపీ అభ్యర్థుల్లో నూతనోత్తేజం

ABN , First Publish Date - 2021-03-07T06:52:04+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గాజువాక విచ్చేసి మాట్లాడటంతో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధుల్లో నూతనోత్తేజం సంతరించుకుంది

టీడీపీ అభ్యర్థుల్లో నూతనోత్తేజం
గాజువాకలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు

గాజువాక, మార్చి 6: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గాజువాక విచ్చేసి మాట్లాడటంతో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధుల్లో నూతనోత్తేజం సంతరించుకుంది. పాతగాజువాక కూడలిలో ప్రచార రఽథం నుంచి చంద్రబాబునాయుడు ప్రసంగించగా దాదాపు అన్ని వార్డుల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ప్రధానంగా గాజువాక ప్రజలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయమై ఎక్కువ సమయం ప్రసంగించడం ఆకట్టుకుంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని ప్రకటించారు. అంతే కాకుండా గాజువాక ప్రాంతంలో ఏళ్ల తరబడి  ప్రజలు ఎదుర్కొంటున్న హౌస్‌ కమిటీ సమస్యను తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కరించిందని, అర్హులందరికీ పట్టాలు ఇచ్చిందన్నారు. గాజువాక ప్రాంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరినీ పరిచయం చేశారు. సభలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అభ్యర్థులు లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాస్‌, పులి లక్ష్మీభాయి, మొల్లి ముత్యాలనాయుడు, చట్టి గోపి, ప్రసాదుల విజయసునీత, భైపిల్లి గాంధీ, పల్లా రమణ, అనంతలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T06:52:04+05:30 IST