బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-10-31T10:39:16+05:30 IST

బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకాన్ని తొలగించి ముఖ్యమంత్రి జగన్‌ అన్యాయం చేస్తున్నారని దళిత విద్యార్థుల జేఏసీ ఆరోపించింది.

బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం కొనసాగించాలి

ఆశీల్‌మెట్ట, అక్టోబరు 30:  బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకాన్ని తొలగించి ముఖ్యమంత్రి జగన్‌ అన్యాయం చేస్తున్నారని దళిత విద్యార్థుల జేఏసీ ఆరోపించింది. ఈ పథకం కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధి సీహెచ్‌ జోగారావు మాట్లాడుతూ  మంత్రులు, ఎంపీలకు అనేక వినతిపత్రాలు ఇచిచనా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తన తండ్రి పెట్టిన పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ తీసివేయడం దారుణమన్నారు. ఈ నిరసనలో నేతలు బి.అప్పలరాజు, ఎస్‌.రవి, యు.మహాలక్ష్మి, కె.కనకరాజు, శ్యామలదేవి, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T10:39:16+05:30 IST