ఆటో డ్రైవర్ నిజాయితీ
ABN , First Publish Date - 2020-10-02T10:01:10+05:30 IST
ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆటోలో పోగొట్టుకున్న నగదును ఆటో డ్రైవర్ పోలీసుల సమక్షంలో అందజేసి నిజాయితీని చాటుకున్నాడు.
పాయకరావుపేట, అక్టోబరు 1 : ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆటోలో పోగొట్టుకున్న నగదును ఆటో డ్రైవర్ పోలీసుల సమక్షంలో అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. అరట్లకోటకు చెందిన లోవరాజు ఈ నెల 29న ఆటో ఎక్కి తాగిన మైకంలో తన వద్ద ఉన్న రూ.4,200 పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఆటోలో పడి ఉన్న నగదును గుర్తించిన పాయకరావుపేటకు చెందిన ఆటో డ్రైవర్ పప్పు మోహన్మణికంఠ పోలీస్ స్టేషన్లో అందజేశాడు. నగదు పోగొట్టుకున్న లోవరాజును గురువారం ఎస్ఐ డి.దీనబంధు స్టేషన్కు పిలిపించి ఆటో డ్రైవర్తో ఇప్పించారు.