తెలుగు మహిళ కమిటీలు ఏర్పాటు

ABN , First Publish Date - 2020-10-02T09:59:15+05:30 IST

పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం (తెలుగు మహిళ) కమిటీలు నియమించింది.

తెలుగు మహిళ కమిటీలు ఏర్పాటు

విశాఖ పార్లమెంటరీ  నియోజకవర్గ అధ్యక్షురాలిగా సర్వసిద్ధి అనంతలక్ష్మి

అనకాపల్లికి ఆడారి మంజు

అరకులోయకు వంతల రాజేశ్వరి

ప్రధాన కార్యదర్శులు కూడా నియామకం


విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం (తెలుగు మహిళ) కమిటీలు నియమించింది.  నియోజక వర్గాలకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షురాలిగా సర్వసిద్ధి అనంతలక్ష్మి (గాజువాక), ప్రధాన కార్యదర్శిగా గణగళ్ల సత్యవతి (విశాఖ దక్షిణం)ని నియమించారు.


అలాగే అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా ఆడారి మంజు (ఎలమంచలి), ప్రధాన కార్యదర్శిగా రమణమ్మ (నర్సీపట్నం), అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా వంతల రాజేశ్వరి (రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే), ప్రధాన కార్యదర్శిగా గబ్బాడి శాంతికుమారిని నియమించారు. అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన మంజు మునగపాక మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శిగా  నియమితులైన అనంతలక్ష్మి, సత్యవతి ఇటీవల వరకు విశాఖ అర్బన్‌ జిల్లా తెలుగు మహిళా కమిటీలో ఉన్నారు.

Updated Date - 2020-10-02T09:59:15+05:30 IST