విశాఖ వేలీకి కొత్త ప్రిన్సిపాల్‌?

ABN , First Publish Date - 2020-10-02T10:02:15+05:30 IST

విశాఖ వేలీ స్కూల్‌కి కొత్త ప్రిన్సిపాల్‌ని నియమించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యా శాఖాఽధికారి లింగేశ్వరరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

విశాఖ వేలీకి కొత్త ప్రిన్సిపాల్‌?

నోటిఫికేషన్‌ ఇచ్చిన డీఈఓ

విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): విశాఖ వేలీ స్కూల్‌కి కొత్త ప్రిన్సిపాల్‌ని నియమించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యా శాఖాఽధికారి లింగేశ్వరరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌గా పనిచేయడానికి అర్హతలు, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం వల్లీశ్‌నాథ్‌ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌ వినయచంద్‌ విచారణ కమిటీ వేశారు. జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ చేయించారు. ఆ నివేదికకు అనుగుణంగా కొత్త ప్రిన్సిపాల్‌ నియామకానికి చర్యలు చేపట్టారని స్కూల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-10-02T10:02:15+05:30 IST