నేడు పింఛన్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-10-01T08:25:03+05:30 IST

వివిధ రకాల సంక్షేమ పింఛన్లు గురువారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 4,87,208 మంది లబ్ధిదారులకు రూ.117.74 కోట్లు సొమ్ము విడుదల చేయగా గ్రామ/వార్డు సచివాలయాలకు బట్వాడా చేశారు.

నేడు పింఛన్ల పంపిణీ

విశాఖపట్నం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వివిధ రకాల సంక్షేమ పింఛన్లు గురువారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 4,87,208 మంది లబ్ధిదారులకు రూ.117.74 కోట్లు సొమ్ము విడుదల చేయగా గ్రామ/వార్డు సచివాలయాలకు బట్వాడా చేశారు. గత నెల కంటే సుమారు ఐదు వేల పింఛన్లు ఎక్కువగా జిల్లాకు మంజూరయ్యాయి. వలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుంటారు. వేలిముద్రలు పడకపోతే ఫేస్‌ రీడింగ్‌ ద్వారా పంపిణీ చేయాలని డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.విశ్వేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-10-01T08:25:03+05:30 IST