ఏం సాధించారని పర్యాటక ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-09-28T10:41:09+05:30 IST
అధికారంలోకి వచ్చి పదిహేను నెలల కాలంలో పర్యాటక రంగం పరంగా ఏం అభివృద్ధి సాధించారని పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు
సిరిపురం , సెప్టెంబరు 27 : అధికారంలోకి వచ్చి పదిహేను నెలల కాలంలో పర్యాటక రంగం పరంగా ఏం అభివృద్ధి సాధించారని పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. ఎన్ని అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బూటక మంత్రి అన్నారు.
కనీసం ఒక్క పార్క్ కూడా అభివృద్ధి చేయకుండా ఎందుకీ ఉత్సవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ర్టాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్ది, పర్యాటక రంగానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఆ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపారన్నారు.