ఫైనల్స్‌కు చేరిన రిచ్‌మాండ్‌ రైడర్స్‌

ABN , First Publish Date - 2021-02-27T06:09:05+05:30 IST

వాల్తేరు రైల్వే క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది

ఫైనల్స్‌కు చేరిన రిచ్‌మాండ్‌ రైడర్స్‌
మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ హేమంత్‌

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 26: వాల్తేరు రైల్వే క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సూపర్‌ సెమీ ఫైనల్స్‌లో రిచ్‌మాండ్‌ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో హెచ్‌సీఏ వారియర్స్‌పై విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 160 పరుగుల స్కోరు చేసింది. కె.రోహన్‌దాస్‌ హాఫ్‌ సెంచరీ(54), ప్రియుమ్‌ ఆశిష్‌(32), శ్యామ్‌(28) రాణించారు. రిచ్‌మాండ్‌ బౌలర్లు ప్రశాంత్‌, హేమంత్‌రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో రిచ్‌మాండ్‌ రైడర్స్‌ ప్రారంభంలో తడబడినా 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది. తపస్వి (48), మురళి (30), ఎస్‌హెచ్‌.శ్రీనివాస్‌ (39నాటౌట్‌) రాణించి విజయాన్నందించారు. హెచ్‌సీఏ బౌలర్‌ డి.రంజిత్‌కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. శనివారం జరిగే ఫైనల్స్‌లో టెడ్డీ స్ర్టైకర్స్‌, రిచ్‌మాండ్‌ రైడర్స్‌ తలపడతాయి. 


Updated Date - 2021-02-27T06:09:05+05:30 IST