కొత్తగా 14 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-02-28T06:43:42+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 60,534కు చేరాయి. వీరిలో 59,961 మంది కోలుకోగా, మరో 34 మంది చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు 539 మంది మృతి చెందారు.