60 వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-16T05:48:12+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. గురు, శుక్ర వారాల్లో కొత్తగా 21 కొవిడ్ కేసులు నమోదయ్యాయి
గత రెండు రోజుల్లో 21 మందికి వైరస్
విశాఖపట్నం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. గురు, శుక్ర వారాల్లో కొత్తగా 21 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 60,009కి చేరాయి. వీరిలో వైరస్ నుంచి 59,306 మంది కోలుకోగా, మరో 174 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం 529 మంది మృత్యువాత చెందారు.