వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి
ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST
వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి
కడ్తాల్/చేవెళ్ల, జూలై 4: వీఆర్వోలను తిరిగి రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని మండల వీఆర్వో సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కడ్తాల తహసీల్దార్ మహేందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దయి సుమారు రెండేళ్లు అయిందన్నారు. ఈనేపథ్యంలో వీఆర్వోలను తిరిగి రెవెన్యూలోనే కొనసాగించి, రెండు సంవత్సరాల కాలనానికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సర్వీస్ రెగ్యులర్ చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం నాయకులు గంగ యాదగిరి గౌడ్, కానుగుల మహేశ్, కావలి లక్ష్మయ్య, మల్లయ్య, స్పూర్తి , సంద్య, శ్రావణి, విజయలక్ష్మి ఉన్నారు. అదేవిధంగా చేవెళ్లలో వీఆర్వోలు యాదయ్య, గణేష్, నాగేశ్వర్, తాజోద్దీన్, శ్రీనివాస్, భారతమ్మ, దయానంద్, బాబయ్య, రాములు, సత్యనారాయణ, అజీజ్ తదితరులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.