వీఆర్వోల నిరసన
ABN , First Publish Date - 2021-12-03T05:23:04+05:30 IST
అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి అప్పల రాజు, పలాస మునిసిపల్ కమిషనర్ రాజగోపాలరావు క్షమాపణ చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు.
మంత్రి అప్పలరాజు, పలాస కమిషనర్ క్షమాపణ చెప్పాలి
తహసీల్దార్ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళన
నిడదవోలు, డిసెంబరు 2 :అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి అప్పల రాజు, పలాస మునిసిపల్ కమిషనర్ రాజగోపాలరావు క్షమాపణ చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు. నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ శాఖను, వీఆర్వోలను కించపరుస్తూ మాట్లాడడం తగదన్నారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. సర్వేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గణపవరం, డిసెంబరు 2 :వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు, పలాస మునిసిపల్ కమిషనర్ రాజగోపాలరావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వీ ఆర్వోల సంఘ మండల అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి ఖండించారు. గురు వారం నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉంగుటూరు, డిసెంబరు 2 :వీఆర్వోలపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మండల వీఆర్వోల సంఘం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందమూరి ఉమా మహేఽశ్వరరావు, ఉపాధ్యక్షుడు జగన్నాథం, సభ్యులు రమణ, ఆముదాల శ్రీను, కుచ్చు వెంకటేశ్వరరావు, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.