బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: వర్లరామయ్య

ABN , First Publish Date - 2020-02-16T02:10:30+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని టీడీపీ నేత వర్లరామయ్య మండిపడ్డారు. అవసరమొస్తే ఎవరి కాళ్లు, గడ్డమైనా పట్టుకుంటామని, నిన్న బొత్స అనలేదా అని ప్రశ్నించారు.

బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: వర్లరామయ్య

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని టీడీపీ నేత వర్లరామయ్య మండిపడ్డారు. అవసరమొస్తే ఎవరి కాళ్లు, గడ్డమైనా పట్టుకుంటామని, నిన్న బొత్స అనలేదా అని ప్రశ్నించారు. ఎన్డీఏలో చేరితే ముస్లింలంతా ఛీకొడతారని, అందుకే వెనక్కి తగ్గారని చెప్పారు. రాజకీయాల్లో విలువలు ఏ విధంగా మారతాయో.. బొత్సను చూస్తే అర్ధమవుతోందన్నారు. బొత్స తన ఆస్తుల్ని ప్రకటించగలరా అని మరోసారి ప్రశ్నించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఉమ్మారెడ్టి కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారో చెప్పాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2020-02-16T02:10:30+05:30 IST