VRA suicide: కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్
ABN , First Publish Date - 2022-09-04T17:22:31+05:30 IST
ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారంలో ఉరేసుకుని వీఆర్ఏ(VRA suicide)
Kamareddy: ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారంలో ఉరేసుకుని వీఆర్ఏ(VRA suicide) అశోక్(Ashok) ఆత్మహత్య చేసుకోవడంతో నాగిరెడ్డిపేట్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కార్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏ అశోక్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ వీఆర్ఏల పేస్కేల్ కోసం పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. అశోక్ మృతదేహంతో వీఆర్ఏలు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వీఆర్ఏలకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా తెలిపారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా కుటుంబ సభ్యులు, వీఆర్ఏలు ధర్నాకు దిగి నిరనసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వీఆర్ఏల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బొల్లారంలో భారీగా పోలీసులు మోహరించారు.