వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-07-01T07:13:38+05:30 IST
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ కోకన్వీనర్ షేక్ మహ్మద్ రఫీ డిమాడ్ చేశారు.
చింతలపాలెం, అనంతగిరి, హుజూర్నగర్ జూన్ 30: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ కోకన్వీనర్ షేక్ మహ్మద్ రఫీ డిమాడ్ చేశారు. చింతలపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిర్వహించిన ధర్నాలో రఫీ మాట్లాడారు. వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇస్తామని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో 20నెలల క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించినా నేటికీ నెరవేరలేదన్నారు. అనం తరం తహసీల్దార్లకు వినతిప్రతం అందజేశారు. అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జానీ మాట్లాడారు. హుజూర్నగర్లో నర్సింహారావు, శ్రీనివాసగౌడ్ మాట్లా డారు. కార్యక్రమంలో వీఆర్ఏలు సైదా, ఏలియా, పుష్పలత, వెంకటేశ్వర్లు, పుల్లమ్మ, షేక్ మదార్సాహేబ్, న్రలమాది సైదులు, సీహెచ్ సునిత, కె.కొండలు, ఎస్.వెంకటేష్, సీహెచ్.నరేష్, ఆర్.నాగమణి, ఎస్కే.మదార్బీ, వీరబాబు, చెన్నయ్య, ఈదయ్య, నవత, పాల్గొన్నారు.