చికిత్సపొందుతూ వీఆర్‌ఏ మృతి

ABN , First Publish Date - 2021-04-22T05:09:37+05:30 IST

స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఎం.తోటూరు గ్రామానికి చెందిన ఉలాసి వెంకటరమణ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు.

చికిత్సపొందుతూ వీఆర్‌ఏ మృతి

ఇచ్ఛాపురం/రూరల్‌, ఏప్రిల్‌ 21: స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఎం.తోటూరు గ్రామానికి చెందిన ఉలాసి వెంకటరమణ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు...ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొవడానికి మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా శాసనాం దాటిన త్వరాత కిందపడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. దీంతో బరంపురం తరలించగా, పరిస్థితి విషమించడంతో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికి త్సపొందుతూ బుధవారం వేకువజామున మృతిచెందారు. మృతదేహాన్ని ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం చేశారు. వెంకటరమణకు భార్య లీలావతి, కుమారులు శివ, సిద్దు(8) ఉన్నారు.   కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మి తెలిపారు. 



Updated Date - 2021-04-22T05:09:37+05:30 IST