ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి

ABN , First Publish Date - 2022-05-26T05:21:23+05:30 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని జనసేన రాయల సీమ, దక్షిణ కోస్తా సమన్వయకర్త మైఫోర్సు మహేష్‌ తెలిపారు

ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి
పాదయాత్ర ప్రారంభిస్తున్న మహేష్‌

మదనపల్లె టౌన, మే 25: సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని జనసేన రాయల సీమ, దక్షిణ కోస్తా సమన్వయకర్త మైఫోర్సు మహేష్‌ తెలిపారు. బుధ వారం మండలంలోని కాశీరావుపేట వద్ద ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసి నియోజకవర్గ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఓటు విలువ పై అవగాహనతోపాటు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియ జేస్తామన్నారు. నియోజక వర్గంలోని మూడు మండలాలు, మున్సిపాలిటీ లో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు.   కాశీరావుపేట, మేకలవాండ్ల మీదుగా పాద యాత్ర సాగింది. జనసేన నాయకులు ఉమేష్‌, మల్లిక, శంకర్‌, శేఖర్‌, అయాజ్‌, మహేంద్ర, పవనకళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T05:21:23+05:30 IST