కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధిచెప్పండి
ABN , First Publish Date - 2022-05-20T04:41:20+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాండ్రేగుల సత్యాంజనేయ కోరారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యాంజనేయ
మల్కాపురం, మే 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాండ్రేగుల సత్యాంజనేయ కోరారు. మల్కాపురం, గాంధీగ్రామ్లో నిర్వహించిన సీపీఐ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచి, విద్యుత్ చార్జీలను పెంచిందని, నీటి, ఇంటి పన్నులతో పాటు, చివరికి చెత్తపై కూడా పన్ను వేయడం దుర్మార్గామన్నారు. సమావేశంలో నేతలు గుడాల రాంబాబు, నూనెల సూరిబాబు, పోతనరాము, బి.హరి, సీహెచ్ మాధవరావు, మధుసూదనరావు, శ్రీరాములు, రామకృష్ణ, వలసన్న, తదితరులు పాల్గొన్నారు.