స్వచ్ఛంద ‘లాక్డౌన్’ అభినందనీయం
ABN , First Publish Date - 2020-07-07T11:19:24+05:30 IST
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాధిత ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని కలెక్టర్ నివాస్ విజ్ఞప్తి చేశారు. రణస్థలంలో
మరో వారం పాటు కొనసాగించండి
రణస్థలం వ్యాపారులకు కలెక్టర్ నివాస్ సూచన
రణస్థలం, జూలై 6: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాధిత ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని కలెక్టర్ నివాస్ విజ్ఞప్తి చేశారు. రణస్థలంలో ఆయన సోమవారం పర్యటించారు. స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్కు ముందుకొచ్చారని తెలుసుకొని అభినందించారు. మరో వారం రోజులు లాక్డౌన్ కొనసాగించాలని సూచించారు.
కంటెన్మెంట్ జోన్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ సుధారాణి, ఆర్ఐ శ్రీనివాస్రావు, వీఆర్వో వెంకటన్న తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. లాక్డౌన్ రెండోరోజు సోమవారం విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు.