వృత్తివిద్యా కోర్సులకు అనుమతి ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-07T05:53:41+05:30 IST

వృత్తివిద్యా కోర్సులకు అనుమతి ఇవ్వాలి

వృత్తివిద్యా కోర్సులకు అనుమతి ఇవ్వాలి
సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

శామీర్‌పేట, జులై 6: మూడుచింతల పల్లి మండలం కేశవరం పరిధిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్‌ కాలేజీకి వృత్తివిద్యా కోర్సుల ఏర్పాటుకు అనుమతించాలని కాలేజి వ్యవస్థాపక సభ్యులు మధుసూదన్‌రెడ్డి, నర్సింహా రెడ్డి, టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతి నిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిలు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం వారు నగరంలోని మంత్రి నివా సానికి వెళ్లి కళాశాలలో వృత్తివిద్యా కోర్సులను ఆరంభించడానికి అనుమతించాలని విన్నవించారు. ఇటీవల కాలంలో వృత్తివిద్యా కోర్సులకు ప్రాధాన్యత పెరగడంతో ఆ కోర్సులను గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-07T05:53:41+05:30 IST