విజ్ఞాన్ లారాలో బీటెక్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST
స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్లారా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రాంభమయ్యాయి.
గుంటూరు(విద్య),జనవరి 18: స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్లారా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రాంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ శాస్త్రీయంగా కృషి చేస్తే విద్యార్థులు ఏరంగంలో అయినా రాణిస్తారని తెలిపారు. చదువుతోపాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, భాష, మృదు నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫణీంద్రకుమార్, జోనల్ ఇన్చార్జి శ్రీకూర్మనాథం తదితరులు పాల్గొన్నారు.