సామాజిక దూరంతోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2020-03-30T11:05:17+05:30 IST
సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు.
గజపతి నగరం/ దత్తిరాజేరు, మార్చి 29: సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం స్థాని క దిగువవీధిలో రేషన్ డిపో వద్ద రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేప థ్యంలో పేదలకు ఏప్రిల్కు సంబంధించి నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ మరడాన అరుణకుమారి, డీటీ కె.సత్యనారాయణ, సీఎస్డీటీ రవి శంకర్, నేతలు గార తవుడు, బెల్లాన త్రినాథరావు, మండల సురేష్ తదితరులు పాల్గొ న్నారు. అనంతరం దత్తిరాజేరు మండలం పోరలి గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.