భారత్లో లాంచ్ అయిన ‘వివో వై30’
ABN , First Publish Date - 2020-07-04T03:19:37+05:30 IST
వివో తన నయా స్మార్ట్ఫోన్ ‘వివో వై30’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో దీనిని
న్యూఢిల్లీ: వివో తన నయా స్మార్ట్ఫోన్ ‘వివో వై30’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో దీనిని మలేసియాలో లాంచ్ చేయగా, తాజాగా భారత మార్కెట్లో దీనిని విడుదల చేసింది. వివో వై30 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర 14,990 రూపాయలు. ఈ ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. యాక్సిక్ బ్యాంక్ బజ్ క్రిడిట్ కార్డు యూజర్లకు 10 శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకు 5 శాతం రాయితీ లభిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లించే వారికి రూ. 75 తగ్గింపు లభించనుంది. అలాగే, నెలకు రూ.1250తో నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
వివో వై 30 స్పెసిఫికేషన్లు: 6.47 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో పీ35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత స్టోరేజీ, ఫన్టచ్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 10, 13 ఎంపీ ప్రధాన సెన్సార్తో క్వాడ్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.