వివేకానంద డే క్యాంపెయిన్‌కు చిన్నజీయర్ మద్దతు

ABN , First Publish Date - 2021-12-02T01:09:15+05:30 IST

శంషాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు త్రిదండి చిన్నజీయర్ స్వామి మద్దతు తెలిపారు.

వివేకానంద డే క్యాంపెయిన్‌కు చిన్నజీయర్ మద్దతు

శంషాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు త్రిదండి చిన్నజీయర్ స్వామి మద్దతు తెలిపారు. క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వివేకానంద పోస్టర్‌ ను ఆయన  పరిశీలించారు. స్వామిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు దూల కృష్ణ గౌడ్, రామకృష్ణ మఠం వాలంటీర్లు నారాయణ రావు, సముద్రాల శరత్ తదితరులున్నారు.


1893లో హైదరాబాద్ పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో ఫిబ్రవరి 13న మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారు. యూరోపియన్లు, నిజాం కొలువులోని మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బహిరంగసభను ఉద్దేశించి వివేకానంద తొలిసారిగా ఆంగ్లంలో ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో వివేకానందలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే స్ఫూర్తితో ఆయన చికాగో వేదికపై ప్రసంగించి విజయవంతమయ్యారు. వివేకానందలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేసిన ఫిబ్రవరి 13ను వివేకానంద దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కోరుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అందరి మద్దతునూ కూడగడుతున్నారు. 

Updated Date - 2021-12-02T01:09:15+05:30 IST