వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ బృందం

ABN , First Publish Date - 2021-11-26T18:45:30+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు డి. శివశంకర్ రెడ్డిని సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందుల కోర్టు అనుమతితో రాత్రి రిమ్స్ ఆసుపత్రి నుంచి సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ బృందం

కడప : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు డి. శివశంకర్ రెడ్డిని సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందుల కోర్టు అనుమతితో రాత్రి రిమ్స్ ఆసుపత్రి నుంచి సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో.. శివశంకర్ రెడ్డి పాత్రపై డ్రైవర్ దస్తగిరి 164-1 వాంగ్మూలంలో ప్రస్తావించిన విషయాలపై సీబీఐ బృందం ఆయనను క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ‘వివేకా హత్యకు సంబంధించి సుపారి అంశం, ఎవరెవరు ఆయనను కలిశారు’ అనే అంశాలపై సీబీఐ శంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Updated Date - 2021-11-26T18:45:30+05:30 IST