వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో సునీల్ యాదవ్
ABN , First Publish Date - 2021-08-03T03:26:56+05:30 IST
వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో సునీల్ యాదవ్
కడప: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. అనుమానితుడు సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐపై సునీల్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. పులివెందులలో నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబం పరారయ్యారు. కొద్దిరోజులుగా సునీల్ కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.