వివేకా హత్య కేసు.. తెరపైకి కొత్త పేర్లు

ABN , First Publish Date - 2021-06-22T15:44:02+05:30 IST

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది.

వివేకా హత్య కేసు.. తెరపైకి కొత్త పేర్లు

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. 16 వ రోజు మంగళవారం అధికారులు విచారణ జరుపుతున్నారు. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా సోమవారం సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ఆరుగురిని విచారించారు. వైఎస్‌ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ఏడుగంటల పాటు విచారించారు. అలాగే కడపకు చెందిన ఉపాధ్యాయుడు రవిశంకర్‌, పులివెందులకు చెందిన క్రిష్ణయ్య, సావిత్రి దంపతులు,   వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఏడు గంటల పాటు ప్రశ్నించి వారి నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన ఉపాధ్యాయుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ మహిళను విచారించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-22T15:44:02+05:30 IST