వివేకా హత్య కేసులో చార్జిషీటు వెనక్కు పంపిన కోర్టు

ABN , First Publish Date - 2021-10-31T01:08:17+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీటును పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది.

వివేకా హత్య కేసులో చార్జిషీటు వెనక్కు పంపిన కోర్టు

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ  సమర్పించిన చార్జిషీటును పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. 27వ తేదీ బుధవారం సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంబంధించి నలుగురి పేర్లను ధ్రువీకరిస్తూ పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన పులివెందుల కోర్టు అందులో కొన్ని తప్పులు ఉన్నట్లు గుర్తించి వాటిని సరిచేసి ఇవ్వాలని  సీబీఐ అధికారులకు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. కోర్టు ప్రస్తావించిన వివరాలను సరిచేసి మళ్లీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

Updated Date - 2021-10-31T01:08:17+05:30 IST