ఎమ్మెల్సీ కళ్యాణి శారదా పీఠం సందర్శన
ABN , First Publish Date - 2021-11-28T05:03:29+05:30 IST
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శనివారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు.
పెందుర్తి రూరల్, నవంబరు 27 : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శనివారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. పీఠం ప్రాంగణంలో గల దేవతా మూర్తులు, శారదా పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని కళ్యాణి దర్శించుకుని పూజలు చేశారు.