మూడున్నరేళ్లలో ప్రభుత్వం కూలిపోతుంది
ABN , First Publish Date - 2020-09-19T09:32:37+05:30 IST
మూడున్నరేళ్లలో ప్రభుత్వం కూలిపోతుంది
- నేతలు జైలుకెళితే జరిగేది అదే: విష్ణుకుమార్రాజు
విశాఖపట్నం, సెప్టెంబరు 18: ‘‘రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో కచ్చితంగా కూలిపోతుంది. అవినీతిపై విచారణకు ఆదేశిస్తే పెండింగ్ కేసులు బయటకు వస్తాయి. స్టే, బెయిలు రద్దవుతాయి. కేసుల విచారణ పూర్తయి నాయకులు జైలుకు వెళితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్రాజు అన్నారు.