యాక్షన్ హీరో విశాల్, డింపుల్ హయతి హీరోహీరోయిన్లుగా నటించిన ‘సామాన్యుడు’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్లైన్తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను బుధవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్ నిర్మించారు.
ట్రైలర్ విషయానికి వస్తే..
‘‘టైటిల్కు తగ్గట్టుగానే సినిమాలో విశాల్ సామాన్యుడిగా కనిపిస్తున్నారు. ఒక క్రైమ్ కథను వివరిస్తూ విశాల్ పాత్ర మొదలైంది. ‘ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒకదానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్లో చూస్తున్నామన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను’ అని విశాల్ చెప్పిన డైలాగ్.. ఈ సినిమా నేపథ్యం ఏమిటో చెప్పేస్తుంది. ఫుల్ యాక్షన్ మోడ్లో ఈ సినిమా ఉండబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. డింపుల్ హయతి, విశాల్ల మధ్య లవ్ స్టోరీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ.. ఇంకా డైలాగ్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్తో వచ్చిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.